సిద్దిపేట జిల్లా: అత్యవసర పరిస్థితుల్లో నిండు గర్భిణీని హాస్పిటల్ కి తరలించి మంచి మనసు చాటుకున్నారు పోలీసులు. మంగళవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ఉప్పులోనిగడ్డకు చెందిన నెలలు నిండిన ఓ గర్భిణీ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉంది. అయితే వాహనాలు లేక రోడ్డు మీద అవస్థలు పడుతుండగా .. అటుగా వెళ్తొన్న పోలీసులు గమనించారు.
ఆమె దగ్గరకు చేరుకున్న పోలీసులు స్వయంగా తమ వాహనంలో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాక్డౌన్ కారణంగా వైద్యం అత్యవసరమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సమయానికి వాహనం దొరక్క ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు పోలీసులు.