గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్ వద్ద ఓ కారులో పెద్ద మొత్తంలో తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వైపు నుంచి చిరాక్ పబ్లిక్ స్కూల్ వైపు ఓ కారులో డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో మాదాపూర్జోన్ఎస్వోటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు వెహికిల్ చెకింగ్ చేపట్టారు.
వైట్ కలర్బ్రీజా కారును ఆపి చెక్చేయగా, రెండు పెద్ద బ్యాగుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కపెట్టగా రూ.5 కోట్లు తేలింది. డబ్బు తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పీఎస్కు తరలించారు. డబ్బును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.