కొండాపూర్​లో రూ. 5 కోట్లు సీజ్ .. ఐటీ శాఖకు అప్పగించిన పోలీసులు

కొండాపూర్​లో రూ. 5 కోట్లు సీజ్ .. ఐటీ శాఖకు అప్పగించిన పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్ వద్ద ఓ కారులో పెద్ద మొత్తంలో తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొండాపూర్​ బొటానికల్ ​గార్డెన్​ వైపు నుంచి చిరాక్ ​పబ్లిక్​ స్కూల్ వైపు ఓ కారులో డబ్బులు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో మాదాపూర్​జోన్​ఎస్​వోటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు వెహికిల్ చెకింగ్ ​చేపట్టారు. 

వైట్ కలర్​బ్రీజా కారును ఆపి చెక్​చేయగా, రెండు పెద్ద బ్యాగుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కపెట్టగా రూ.5 కోట్లు తేలింది. డబ్బు తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి  పీఎస్​కు తరలించారు. డబ్బును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.