వీడిన మర్డర్ మిస్టరీ : ఆస్తి కోసమే ఆ ఆరుగురిని చంపింది

వీడిన మర్డర్ మిస్టరీ : ఆస్తి కోసమే ఆ ఆరుగురిని చంపింది

కోజికోడ్ లో 2002 నుంచి 2016 మధ్య ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల మర్డర్ మిస్టరీని కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేధించారు. ఆస్తి కోసం ఇంటి యజమాని రెండో కోడలు జోలీయే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. ఈ కేసులో జోలితో పాటు ఆమె రెండో భర్త షాజు, మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పకడ్బందీ వ్యూహంతో పదహారేళ్ల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరిని అంతమొందించినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. హత్యల కోసం సయనైడ్ వినియోగించిట్లు పోలీసులు ధృవీకరించారు.