బీజేపీ నేతల ప్రెస్ మీట్ ను అడ్డుకున్న పోలీసులు

బీజేపీ నేతల ప్రెస్ మీట్ ను అడ్డుకున్న పోలీసులు

వరంగల్: హుజురాబాద్ లో విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని తెలిపారు  బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. శుక్రవారం వరంగల్ లో వివేక్, ప్రేమేందర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. నిన్న టీఆఎర్ నేతలు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ప్రెస్ మీట్ పెడితో వర్తించని ఎన్నికల కోడ్.. ఇప్పుడు మీరెలా అడ్డుకుంటారన్నారు. టీఆర్ఎస్ మంత్రులను ఎందుకు అడ్డుకోలేదని పోలీసులను ప్రశ్నించారు బీజేపీ నేతలు. దీంతో బీజేపీ నేతలతో పోలీసుల మధ్యన వాగ్వాదం జరిగింది.