చెరువులోకి కాలుష్య జలాలు.. మృత్యువాతపడ్డ చేపలు

చెరువులోకి కాలుష్య జలాలు.. మృత్యువాతపడ్డ చేపలు

సంగారెడ్డి జిల్లా: చెరువులోకి కాలుష్య జలాలు చేరడంతో చేపలు మృత్యువాతపడ్డ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. అమీన్​పూర్ మండలం, దాయారలోని గండిగూడ చెరువులోకి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పారిశ్రామిక వాడల నుంచి కాలుష్య జలాలు చేరడంతో చేపలన్నీ మృత్యువాతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులు.

2 నుంచి 3 కిలోలు ఎదిగి చేతికి వస్తున్నాయనుకునే సమయంలో చేపలన్నీ చనిపోయాయని తెలిపారు మత్స్యకారులు. రెండేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగిందని  దాని నుంచి కోలుకోక ముందే మళ్లీ ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు నిర్వహించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.