టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: పొన్నాల

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: పొన్నాల

టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే సీఎం కేసీఆర్ కొత్తనాటకం ఆడుతున్నారని ఆరోపించారు. హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో రమేష్ అనే వ్యక్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోసం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావాలంటే లక్ష రూపాయాలు లంచం అడిగారని..అందుకే మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కోసం లక్ష లంచం అడిగినందుకే రమేష్ సూసైడ్ చేసుకున్నాడని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇల్లు కోసం ఒక సాధారణ గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే.. రాష్ట్ర పాలన అధ్వానంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఇలాకాలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎట్లా వుందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ కొత్త టెక్నాలజీ అంటే అందులో అంతా మోసమే ఉంటుందన్నారు. కరెంట్ కొనుగోలు అంతా దోపిడీ మయంగా మారిందన్నారు.