మున్నూరు కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తం : పొన్నం ప్రభాకర్​

మున్నూరు కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తం : పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్, వెలుగు: మున్నూరుకాపులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మున్నూరు కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్​, వేములవాడలో మున్నూరుకాపు భవనాలకు రూ.10 లక్షల చొప్పున కేటాయించానని తెలిపారు.

శనివారం సెక్రటేరియెట్​లోని తన చాంబర్​లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​తో పాటు మున్నూరుకాపు సంఘాల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. మున్నూరుకాపు సామాజికవర్గంలోని చాలా మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడిప్పుడే తమ కులంలో అక్షరాస్యత పెరుగుతున్నదని చెప్పారు. మున్నూరుకాపు ఫెడరేషన్​ ఏర్పాటు చేస్తే తమ సంఘాల అభివృద్ధి జరుగుతుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.