హైదరాబాద్, వెలుగు: మున్నూరుకాపులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మున్నూరు కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్, వేములవాడలో మున్నూరుకాపు భవనాలకు రూ.10 లక్షల చొప్పున కేటాయించానని తెలిపారు.
శనివారం సెక్రటేరియెట్లోని తన చాంబర్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు మున్నూరుకాపు సంఘాల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. మున్నూరుకాపు సామాజికవర్గంలోని చాలా మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడిప్పుడే తమ కులంలో అక్షరాస్యత పెరుగుతున్నదని చెప్పారు. మున్నూరుకాపు ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే తమ సంఘాల అభివృద్ధి జరుగుతుందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.