
- నేడు హాజరు కానున్న పొన్నం
హైదరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పీసీసీ ఏర్పాటు చేసిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం బుధవారం నుంచి రీ స్టార్ట్ కానుంది. కొన్ని కారణాల వల్ల ఆగిన ఈ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చొరవ తీసుకొని మళ్లీ ప్రారంభిస్తున్నారు. బుధవారం గాంధీ భవన్లో జరగనున్న ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు అవుతారని పీసీసీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది.
మహేశ్ కుమార్ సూచన మేరకు ప్రతిరోజు ఇద్దరు ప్రజా ప్రతినిధుల అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో బాగంగా ఈ నెల 10 నుంచి గాంధీ భవన్లో రోజూ ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా అందుబాటులో ఉంటారని పీసీసీ వెల్లడించింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వంద్వారా పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారని పేర్కొంది.