కరోనాతో ఆస్పత్రిలో చేరిన మణిరత్నం

 కరోనాతో ఆస్పత్రిలో చేరిన మణిరత్నం

చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. ఆందోళన చెందాల్సినదేమీ లేదని.. ముందు జాగ్రత్తగా చెన్నైలోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్ - 1’ వచ్చే సెప్టెంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణం పూర్తి కావడంతో గత వారం టీజర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నంతోపాటు మూవీ టీమ్ కీలక సభ్యులందరూ పాల్గొన్నారు. 

అయితే టీజర్ విడుదల సందర్భంగా కొవిడ్ రూల్స్ పట్టించుకోకపోవడం వల్లే మణిరత్నం కరోనా బారినపడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వెటరన్ హీరో శరత్ కుమార్.. ఆ తర్వాత విక్రమ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారినపడడం ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నా.. స్వల్ప లక్షణాలేనని చెబుతుండడం అభిమానులకు ఊరట కలిగిస్తోంది.