పోస్టల్ బ్యాలెట్లన్నీ టీఆర్ఎస్ వైపే

పోస్టల్ బ్యాలెట్లన్నీ టీఆర్ఎస్ వైపే

దుబ్బాక ఉపఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్‌కు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం 1504 ఓట్లలో 1453 ఓట్లు పోలయ్యాయి. వాటిలో టీఆర్ఎస్‌కు 720, బీజేపీకి 368, కాంగ్రెస్‌కు 142 ఓట్లు పోలయ్యాయి. కాగా.. 72 ఓట్లు ఇన్‌వాలిడ్‌గా పోలయ్యాయి. ఈవీఎం కౌంటింగ్‌కు సంబంధించి మొదటి రౌండు నుంచి అయిదు రౌండ్ వరకూ బీజేపీ ఆధిక్యంలోనే దూసుకెళ్లింది. మొదటి రౌండులో బీజేపీ 620 ఓట్లు, రెండో రౌండులో 279 ఓట్లు, మూడో రౌండులో 1259 ఓట్ల మెజారిటీని సాధించింది. నాలుగో రౌండులో 1425 ఓట్ల మెజారిటీని, అయిదోరౌండులో 336 ఓట్ల మెజారిటీని సాధించింది. మొత్తంగా దుబ్బాక మండలంలో అయిదు రౌండ్లలో కలిపి బీజేపీ 3020 ఓట్ల మెజారీటీ సొంతం చేసుకుంది.

మొదటి రౌండులో పలితాలలో కాంగ్రెస్ 648, బీజేపీ 3208, టీఆర్ఎస్ 2,867 ఓట్లు సాధించాయి.

రెండో రౌండులో పలితాలలో బీజేపీ 1561, టీఆర్ఎస్ 1282 ఓట్లు సాధించాయి. ఈ రౌండులో బీజేపీకి 279 ఓట్ల ఆధిక్యం లభించింది.

మూడో రౌండులో ఫలితాలలో బీజేపీ 6492, టీఆర్ఎస్ 5357, కాంగ్రెస్ 1315 ఓట్లు సాధించాయి. ఈ రౌండులో బీజేపీకి 1,259 ఓట్ల ఆధిక్యం లభించింది.

నాలుగో రౌండులో బీజేపీకి 1,425 ఓట్ల ఆదిక్యం లభించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. సొంతూరు బొప్పాపూర్‌లో 277 ఓట్ల ఆధిక్యం సాధించారు. అక్కడ బీజేపీకి 424, టీఆర్ఎస్‌కు 147 ఓట్లు లభించాయి. మొత్తంగా నాలుగు రౌండ్లలో కలిపి బీజేపీ 2,684 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

అయిదోరౌండులోనూ బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. అయిదోరౌండు కౌంటింగ్‌లో 336 ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా అయిదురౌండ్లలో కలిపి బీజేపీ 3020 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.

అయిదు రౌండ్ల తర్వాత ఆధిక్యంలోకి టీఆర్ఎస్
అయిదు రౌండ్ల తర్వాత మొదటిసారి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. మొదటి అయిదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించగా.. ఆరో రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఈ రౌండులో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యంలో ఉంది. దాంతో బీజేపీ 2667 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆరో రౌండులో బీజేపీ 3709 ఓట్లు, టీఆర్ఎస్ 4062 ఓట్లు, కాంగ్రెస్ 530 ఓట్లు దక్కించుకున్నాయి. ఈ రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన సొంతూరైన చిట్టాపూర్‌లో 846 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 406 ఓట్లు దక్కించుకున్నారు.

ఏడో రౌండులో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ 182 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఈ రౌండులో టీఆర్ఎస్‌కు 2718, బీజేపీకి 2536, కాంగ్రెస్ 749 ఓట్లు వచ్చాయి. ఏడు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 22,762 ఓట్లు, టీఆర్ఎస్‌కు 20,277 ఓట్లు, కాంగ్రెస్‌కు 4,003 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఏడో రౌండ్ వరకు 52,055 ఓట్లు లెక్కించారు.

ఎనిమిదో రౌండులో మళ్లీ బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఈ రౌండులో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 3106 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ 2495, బీజేపీ 3116, కాంగ్రెస్ 1122 ఓట్లు సాధించాయి.