లోక్ సభ ఎన్నికల కారణంగా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా

లోక్ సభ ఎన్నికల కారణంగా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా

లోక్ సభ ఎన్నికల దృష్యా యూనియన్ పబ్లిక్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ను వాయిదా వేసింది. ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. మార్చి రెండో వారం వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల‌ను స్వీక‌రించారు. ఈ నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే26న జరగాల్సి ఉండగా.. జూన్ 16కు వాయిదా వేస్తూ యూపీఎస్పీ మంగళవారం ప్రకటించింది. దీంతో జూన్ 16న ప్రిలిమినరీ, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు.