ఏపీ వ్యాప్తంగా పాల్ యాత్ర

ఏపీ వ్యాప్తంగా  పాల్ యాత్ర

హైదరాబాద్, వెలుగు: ప్రాణం పోయినా తన యాత్ర ఆపేదిలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. శుక్రవారం ఏపీ యాత్రకు బయల్దేరే ముందు హైదరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం నుంచి ఏపీలోని 23 జిల్లాల్లో ‘‘పాల్  రావాలి.. పాలన మారాలి” పేరిట యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ యాత్రలో తనపై దాడి జరిగినా, హాని కలిగినా ఏపీ సీఎం వైఎస్ జగన్​మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనకు జగన్, మాజీ సీఎం చంద్రబాబు  ఇతర పార్టీల నేతలెవరితోనూ శత్రుత్వం లేదని పాల్ చెప్పారు. వాళ్ల పరిపాలనా విధానంపైనే తాను విభేదిస్తున్నానని తెలిపారు. యాత్రలో కుల.. ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తానని పాల్ వెల్లడించారు.