మెగా అభిమానులకు ఈ చిత్రం అంకితం

మెగా అభిమానులకు ఈ చిత్రం అంకితం

ప్రతిరోజూ పండగే చిత్రం విడుదలై ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘ప్రతిరోజూ పండగే’ సంబరాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిరోజూ పండగే సినిమా నా కెరీర్‌‌లో గుర్తుండిపోయే సినిమా. ఇలాంటి సమయంలో మంచి కథతో నాకు విజయాన్ని అందించిన మారుతి గారికి థాంక్స్; మా సినిమాకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సినిమాను సపోర్ట్ చేసున్న అందరికీ ధన్యవాదాలు, ఈ సక్సెస్ ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నా’’ అన్నా రు. దర్శకుడు మారుతీ మాట్లాడుతూ..“ ఈ సినిమా కథ రాసుకున్నపుడే రాజమండ్రిలో షూట్ చేయాలని అనుకున్నా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి సక్సెస్ మరిన్ని మంచి సినిమాలు తీసేలా బలాన్ని చేకూరుస్తాయి’’ అన్నా రు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. ‘‘అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు, ఒక సక్సెస్‌ఫుల్ సినిమాను నిర్మించారు. మారుతి కష్టమైన సబ్జెక్ట్‌ను కూడా ఈజీగా డీల్ చేశాడు. సాయి తేజ్‌కు హిట్ వచ్చింది అంటే నా ఫ్యామిలీకి వచ్చినట్లే. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అరవింద్, వాసు గారికి థాంక్స్’’ అన్నా రు. అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాను పెద్ద హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మారుతి నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు కొంత సందేహం ఉంది, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ లేవు కదా అన్న అనుమానం ఉండేది. కానీ మారుతి కాన్ఫిడెంట్‌గా చిత్రీకరించాడు. షూటింగ్ పూర్తయ్యాక తర్వాత సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూనే ఉన్నాం. ఈ ఏడాది చివర్లో సాయి తేజ్ సక్సెస్ కొట్టాడు.ఈ విజయం అందరి విజయం’’ అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ..“వరుస విజయాలు తెచ్చుకునే సంస్థలుగా పేరు తెచ్చుకుంటున్నాయి యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్స్ట్ . ఈ సంస్థలకు మరో మెగా విజయం వచ్చింది. మారుతి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మారుతి తాను నమ్మిన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించే దర్శకుడు. కథ విన్నప్పుడే ఈ సినిమా విజయాన్ని ఉహించాను.” అన్నారు.