తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు సాగాలి.. రాష్టపతి ద్రౌపది ముర్ము

తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు సాగాలి.. రాష్టపతి ద్రౌపది ముర్ము

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపతిముర్ము. ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ,ఆర్థిక ,సాంకేతిక అభివృద్ధి శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిదిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.

తెలంగాణ  గొప్ప సాంస్కృతిక వారసత్వం,డైనమిక్ వృద్ధి చరిత్రను ప్రశంసిస్తూ సోషల్ మీడియా Xలో ఆమె ఓ పోస్ట్ చేశారు. "రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ,ఆర్థిక ,సాంకేతిక అభివృద్ధిని శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి ,శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు. 

తెలంగాణకు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు.. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల జీవనం మెరుగుపర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు,సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ తెలిపారు. 

తెలంగాణ ప్రజలకు అమిత్ షా శుభాకాంక్షలు 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ సాంస్కృతిక గొప్పతనాన్ని ,ప్రజల కష్టపడి పనిచేసే స్ఫూర్తిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో ఇంగ్లీష్ ,తెలుగు రెండింటిలోనూ తన ట్వాట్ చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సోదరసోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. గొప్ప సంస్కృతి, వారసత్వం ,కష్టపడి పనిచేసే ప్రజలతో, తెలంగాణ భారతదేశ జాతి-సాంస్కృతిక పటంలో ప్రకాశవంతంగా వెలుగుతోందన్నారు. రాష్ట్రం శ్రేయస్సులో కొత్త శిఖరాలకు చేరుకుంటుంది." అని ట్వీట్ లో రాశారు. 

తెలంగాణ అధికారికంగా జూన్ 2, 2014న ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అధినేత కేసీఆర్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.ఎన్నికలలో ఆ పార్టీ మెజారిటీ సాధించింది.