పూజ చేసే ఆలయంలోనే అర్చకుడి దొంగతనం

పూజ చేసే ఆలయంలోనే అర్చకుడి దొంగతనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి ఆలయంలో చోరి జరిగింది. జనవరి 29 శనివారం మధ్యాహ్నం ఆలయంలో ఎవరూ లేని సమయంలో ఆలయ అర్చకులు శేషు శాస్త్రి హుండీ నుండి డబ్బులు దొంగలించటాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు.  అనంతరం సదరు అర్చకునికి 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ నోటీసులు జారీ చేశారు.అయితే ఇదే అర్చకులు 2021 ఫిబ్రవరిలో  ఓ భక్తురాలి లాకెట్ దొంగలించి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. పెద్దమ్మతల్లి గుడి హుండీలో డబ్బులు మాయం చేసిన అర్చకుడిపై అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.