వెస్ట్ బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

వెస్ట్ బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

కర్ణాటక రాష్ట్రంలో సెక్స్ స్కాండల్ కేసు సంచలనం సృష్టించగా.. తాజాగా వెస్ట్ బెంగాల్ లో ఏకంగా గవర్నర్ పైనే లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగుచూశాయి.  కోల్ కత్తాలోని రాజ్ భవన్ లో పని చేస్తున్న ఓ మహిళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సివి ఆనంద బోస్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో గవర్నర్ పై ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఫిర్యాదు ప్రకారం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనకు ముందు ఈ ఆరోపణలు వచ్చాయి. CV ఆనంద బోస్ 1977 బ్యాచ్ (రిటైర్డ్) IAS అధికారి. ఆయన 2022 నవంబర్ 23 నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.