వికసిత్ భారత్ కోసం.. జనం కోసమే పని చేస్తున్నాం : ప్రధాని మోదీ

వికసిత్ భారత్ కోసం.. జనం కోసమే పని చేస్తున్నాం : ప్రధాని మోదీ

రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోదీ లోక్ సభలో మంగళవారం ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. మణిపూర్ అల్లర్లు, నీట్ పరీక్ష పేపర్ లీకులపై ప్రధాని మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశారు. మోదీ మాట్లాడుతుండంగానే ఆయనకు వ్యతిరేకంగా ఉయ్ వాట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. సభ అంతా గంధరగోళంగా మారింది. దీంతో  స్పీకర్ ఓం బిర్లా సభ్యులు సభామర్యాదలు పాటించాలని హెచ్చరించారు. గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధాని చెప్పుకుంటూ వచ్చారు. 

ప్రతిపక్షాలకు స్పీకర్ నచ్చజెప్పినా వినలేదు. విపక్షాల నినాదాల మధ్యనే ప్రధాని ధన్యవాద తీర్మాణం తెలిపారు. వికసిత్ భారత్ దిశగా రాష్ట్రపతి ప్రసంగం ఉందని ఆయన అభివర్ణించారు. మూడో సారి సేవ చేయడానికి ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారని మోదీ అన్నారు. 25కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని అందుకే దేశ ప్రజలు బుజ్జగింపు రాజకీయాలకు బుద్ధి చెప్పారని లోక్ సభలో చెప్పారు.

నేషన్ ఫస్ట్ అనే నినాదంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, గడిచిన పదేళ్లలో ప్రపంచంలోనే భారత్ ఖ్యాతి ఎంతో పెరిగిందని ప్రధాని వివరించారు. దేశ ప్రజలకు నమ్మకం ఉండి, గతంలో మా ప్రభుత్వ పాలన నచ్చి మళ్లీ అధికారం ఇచ్చారని ప్రధాని మోదీ అన్నారు. గడిచిన పదేళ్లలో అవినీతిని ఎక్కడా సహించలేదని ప్రధాని ధన్యవాద ప్రసంగంలో తెలిపారు. 2014 కంటే మందు దేశం నిరాశలో కూరుకుపోయిందని.. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేశామని ప్రధాని ప్రసంగించారు.