ఇయ్యాల సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటన

ఇయ్యాల సంగారెడ్డిలో ప్రధాని మోదీ పర్యటన
  • ఉదయం మహాంకాళి టెంపుల్​ను దర్శించుకోనున్న మోదీ

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ సోమవారం ఆదిలాబాద్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి లు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఆయనకు స్వాగతం పలికారు. 

అనంతరం ప్రధాని రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ మహాంకాళి టెంపుల్ లో దర్శనం చేసుకొని అనంతరం సంగారెడ్డి పర్యటనకు ప్రధాని వెళ్లనున్నారు..