ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ...ఇవాళ ( మంగళవారం) కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. ఐఐటీ-కాన్పూర్ నుంచి మోతీ జీల్ వరకూ సుమారు 9 కిలోమీటర్ల పొడవైన రైల్ ప్రాజెక్టు ఇది. మొత్తం 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును 11,000 కోట్లతో పూర్తి చేస్తున్నట్టు PMOకార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మోడీ ప్రధానంగా దృష్టి సారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని.. ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్ట్ మరో ముందడుగని తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం..
ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నవ్