విషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..

విషాదం.. వీకెండ్ అని ఈతకు వెళ్లిన యువకుడు మృతి..

మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. క్వారీలో పడి యువకుడు మృతి చెందాడు. వివారాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రషర్ క్వారీలో పడి గౌతం అనే యువకుడు మృతి చెందాడు. ఓ కంపెనీలో సేల్స్ మ్యాన్ గా పని చేస్తున్న గౌతం వికెండ్ సందర్భంగా తన స్నేహితులతో కలిసి అంకిరెడ్డిపల్లి గ్రామంలోని మహాలక్ష్మి క్రషర్ క్వారీలో ఈతకని వెళ్లాడు. గౌతం క్రషర్ క్వారీలో ఫోటోలు దిగుతూ ఉండగా నీటిలో లోతైన గుంతలు ఉండటంతో నీట మునిగాడు.

ఈ క్రమంలోనే గౌతం మృతి చెందాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచాం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గౌతమ్ స్వస్థలం సైనిక్ పురిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే మరో యువకుడు క్రషర్ క్వారీలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.