రేపు, ఎల్లుండి తెలంగాణలో మోదీ పర్యటన

రేపు, ఎల్లుండి తెలంగాణలో మోదీ పర్యటన
  • మల్కాజిగిరిలో రోడ్ షో.. నాగర్ కర్నూల్​లో సభకు హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొద లైంది. బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండ్రోజులు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం (ఈ నెల15) సాయంత్రం మల్కాజిగిరిలో సుమారు గంటర్నర పాటు మోదీ రోడ్ షో నిర్వహణకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు.

దీనికోసం చుట్టుపక్కల సెగ్మెంట్ల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. శనివారం (16వ తేదీ) నాగర్ కర్నూల్ లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించ నున్నారు. ఈ సభకు చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించాలని నిర్ణయించారు. ఈ నెల18న కూడా జగిత్యాలలో మోదీ బహిరంగ సభ పెట్టనున్నట్టు నేతలు చెప్తున్నారు.