రంజీ ట్రోఫీలో భాగంగా అస్సాం, ముంబై జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఆటగాడు పృథ్వీ షా డబుల్ సెంచరీ బాదాడు. పృథ్వీకి ఇది రెండో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ కావడం విశేషం. 235 బంతులను ఎదురుకున్న పృథ్వీ షా డబుల్ సెంచరీని సాధించాడు. ఇందులో 28 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ముషీర్ ఖాన్తో కలిసి తొలి వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన షా ముంబై జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు.23 ఏళ్ల పృథ్వీ షా41 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో 3300 పైగా పరుగులు చేశాడు.
2018లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. ఇప్పటివరకు 5 టెస్టుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా 339 పరుగులు చేశాడు. ఇక 6 వన్డేల్లో 189 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు 49 పరుగులు. పృథ్వీ షా జూలై 2021 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరమయ్యాడు. ఇప్పటికీ వరకు మళ్లీ బీసీసీఐ అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకోలేదు. చాలా కష్టపడుతున్నానప్పటికీ తనకి అవకాశాలు రాకపోవటం పట్ల పలుమార్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.