ఇక పృథ్వీ 2.0ను చూస్తారు

ఇక పృథ్వీ 2.0ను చూస్తారు

ముంబై: డోపింగ్‌‌ నిబంధనలను ఉల్లంఘించి నిషేధానికి గురైన టీమిండియా యువ క్రికెటర్‌‌‌‌ పృథ్వీషా మళ్లీ బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు.  శనివారం 20వ ఏట అడుగుపెట్టిన షా.. తొందర్లోనే రీఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపాడు. ‘ఈ రోజుతో నాకు 20 ఏళ్లు నిండాయి. ఇక నుంచి పృథ్వీ షా 2.0 చూస్తారని హామీ ఇస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన వారికి, విషెస్‌‌ చెప్పిన అందరికీ థ్యాంక్స్‌‌. అతి త్వరలోనే మైదానంలో అడుగుపెడుతా’అని ట్వీట్‌‌ చేశాడు.  పృథ్వీపై  బీసీసీఐ విధించిన 8 నెలల బ్యాన్​  ఈనెల15తోనే ముగుస్తుంది. ఆ వెంటనే  ముస్తాక్ అలీ ట్రోఫీలో షాను ఆడించాలని ముంబై క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది.