నల్గొండ, వెలుగు : సంతానం కలగడం లేదనే మనస్తాపంతో ఓ ప్రైవేట్ టీచర్ స్కూల్లోనే సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండ పట్టణంలో సోమవారం జరిగింది. టూటౌన్ సీఐ రాఘవరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ కు చెందిన మండల్ నందిత(36) నల్గొండ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు.
ఆమెకు వివాహమై 14 ఏండ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. ఈ విషయమై ఆమె కొంతకాలంగా తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది. ఈ క్రమంలోనే సోమవారం స్కూల్ ముగిసిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఆమె అదే స్కూల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మండల్ ప్రొలాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
