8న హైదరాబాద్‌‌‌‌కు ప్రియాంకా గాంధీ

8న హైదరాబాద్‌‌‌‌కు ప్రియాంకా గాంధీ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఈనెల 8న హైద రాబాద్ రానున్నారు. అదే రోజున సరూర్‌‌‌‌‌‌‌‌నగర్ స్టేడియంలో నిర్వ హించనున్న నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారం ముగిం చుకుని 8న సాయంత్రం 4 గంటల కు హైదరాబాద్‌‌‌‌కు ప్రియాంక చేరు కుంటారని పీసీసీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెం ట్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఎల్బీనగర్ చౌరస్తాకు ప్రియాంక చేరుకుని.. శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళి అర్పిస్తారని చెప్పారు. అక్కడి నుంచి కాలినడకన ర్యాలీగా సరూర్‌‌‌‌‌‌‌‌నగర్ స్టేడియం దాకా చేరు కుంటారని వెల్లడించారు. నిరుద్యో గ సభ నిర్వహణ, ప్రియాంకా రాక నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై పీసీసీ ముఖ్య నేతల సమావేశం మంగళవారం జూమ్‌‌‌‌లో జరిగింది.

సమావేశంలో ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి తదితరులు పాల్గొన్నారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఉండడంతో రేవంత్‌‌‌‌రెడ్డి గైర్హాజరయ్యారు.