ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..

ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు  ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దైంది. నవంబర్ 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భగంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో బస్సు యాత్రను చేపట్టింది. ఈ ప్రచారంలో రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం(అక్టోబర్ 31) ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది.

షెడ్యూల్ ప్రకారం.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌ లో జరగనున్న  మహిళా సభలో  ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల చివరి నిమిషయంలో ఆమె పర్యటన రద్దు అయ్యింది. దీంతో ఆమెకు బదులుగా రాహుల్ గాంధీ సభకు హాజరుకానున్నారు. అనంతరం మూడు రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇప్పటికే.. మొదటి విడత బస్సు యాత్రలో రాహుల్ పాల్గొని  ప్రచారం చేసిస విషయం తెలిసిందే.