జులై 7 తర్వాత రాష్ట్రంలో ప్రియాంక పర్యటన

జులై 7 తర్వాత రాష్ట్రంలో ప్రియాంక పర్యటన

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందే 60 శాతం సీట్లపై ప్రకటన ఉంటుందని కాంగ్రెస్  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్  జనరల్  సెక్రటరీ ప్రియాంకా గాంధీతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయా లపై ఇతర అంశాలపై వారు చర్చించారు. అనంతరం మీడియాతో కోమటిరెడ్డి మాట్లాడారు.

జులై 7 తర్వాత తెలంగాణలో ప్రియాంక పర్యటిస్తారని తెలిపారు. ప్రతి పదిరోజులకు ఒకసారి రాష్ట్ర పర్యటన చేపట్టాలని  విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. 33 జిల్లాలు కవర్ అయ్యేలా ప్రచారం ఉండాలని కోరామని చెప్పారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించారని, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సూచించారని వివరించారు. కాగా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారా అని మీడియా ప్రశ్నించగా... అందరూ కాంగ్రెస్ లోకి వస్తారని వెంకట్  రెడ్డి బదులిచ్చారు.