కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరుకాని ప్రియాంక

కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరుకాని ప్రియాంక

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ వర్కింగ్​కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. విజయభేరి సభలో పాల్గొనకుండానే తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతో ఆమె సీడబ్ల్యూసీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఢిల్లీకి వెళ్లారు. 

ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాజ్​కృష్ణా హోటల్​ నుంచి బయల్దేరి శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ప్రొటోకాల్​ కమిటీ చైర్మన్​ హర్కర వేణుగోపాల్, ఇతర నేతలు ప్రియాంకకు వీడ్కోలు పలికారు.