హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ వర్కింగ్కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. విజయభేరి సభలో పాల్గొనకుండానే తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతో ఆమె సీడబ్ల్యూసీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఢిల్లీకి వెళ్లారు.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాజ్కృష్ణా హోటల్ నుంచి బయల్దేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఇతర నేతలు ప్రియాంకకు వీడ్కోలు పలికారు.