ప్రభుత్వం అంటే ఏంటో చూపే వ్యక్తికే ఓటెయ్యండి : ప్రియాంక గాంధీ

ప్రభుత్వం అంటే ఏంటో చూపే వ్యక్తికే ఓటెయ్యండి : ప్రియాంక గాంధీ
  •     తెలంగాణ ఓటర్లకు ప్రియాంక గాంధీ పిలుపు

న్యూఢిల్లీ, వెలుగు :  నిజమైన ప్రభుత్వం ఎలా పని చేస్తుందో చూపించగలిగే వ్యక్తికే ఓటు వేయాలని తెలంగాణ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్‌‌‌‌లో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘మీ ఓటు మీ అతిపెద్ద బాధ్యత. మన పిల్లల భవిష్యత్తు కోసం, మాతృభూమి కోసం.. మీ ప్రియమైన వారు తమ జీవితాలను త్యాగం చేశారు’’అని పేర్కొన్నారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ఓటర్లను ఆమె కోరారు.