ఎందుకింత రచ్చ చేస్తున్నారు... పూజా హెగ్డే విషయంలో ప్రొడ్యూసర్ ఫైర్

ఎందుకింత రచ్చ చేస్తున్నారు...  పూజా హెగ్డే విషయంలో ప్రొడ్యూసర్ ఫైర్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్(Trivikram) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ గుంటూరు కారం(Gunturkaram). ఈ మూవీ నుంచి లీకులు సోషల్ మీడియాలో ఎలా హల్ చల్ చేస్తున్నాయో..ఫస్ట్ సింగిల్ అప్డేట్ విషయంలో కూడా అలానే వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ గుంటూరు కారం మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ మూవీలో మొదట పూజా హెగ్డే(PoojaHegde) ను హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. పూజా హెగ్డే స్థానంలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌద‌రి ఎంపికవ్వడం పట్ల రకరకాల రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా మారడంటూ వస్తున్న వార్తలపై ప్రొడ్యూసర్ నాగవంశీ ట్విట్టర్, ఇంటర్వ్యూ ల ద్వారా క్లారీటీ ఇచ్చారు.

హీరోయిన్ పూజా వైదొల‌గ‌డంపై సోషల్ మీడియాలో ఇంత రచ్చ ఎందుకు జరుగుతుందో..త‌న‌కు అర్థం కాలేద‌ని ప్రొడ్యూసర్ నాగ‌వంశీ లేటెస్ట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అసలు విషయం ఏంటంటే.. పూజాకి కాల్షీట్లు స‌ర్ధుబాటు కాక‌పోవ‌డం వ‌ల్ల‌నే గుంటూరు కారం నుంచి వైదొల‌గింద‌ని క్లారిటీ ఇచ్చారు. ముందు డిసైడ్ అయిన షూట్ షెడ్యూల్ ప్ర‌కారం మేం సెట్స్ లోకి వెళ్ల‌లేక‌పోయాం.

పూజా లేట్ చేస్తుండటంతో.. తాపీగా అనుకున్న టైంకి షూట్ చేయలేకపోయాము. కానీ, అప్ప‌టికే పూజాకు హిందీలో వేరే మూవీ క‌మిట్ మెంట్ ఉండటంతో..దానివ‌ల్ల కాల్షీట్లు టైంకి స‌ర్ధుబాటు చేయ‌లేక‌పోయింది..అని ప్రొడ్యూసర్ నాగ వంశీ తెలిపారు.

అలాగే గుంటూ కారం మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగడం ఖాయం. అందులో ఎటువంటి డౌట్స్ పెట్టుకోవొద్దని నెటిజన్స్ కి చురకలు అంటించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ దసరా ఫెస్టివల్ కు రిలీజ్ కాబోతుందని. ఈ సాంగ్ మెలోడీ లో ఉండనుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రెండు సాంగ్స్ షూట్ కూడా కంప్లీట్ అయిందని..మిగతా 4 సాంగ్స్ ను ఈ ఏడాది2023 చివర్లో పూర్తీ అవుతుందని ఇంటర్వ్యూలో పేర్కోన్నారు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్(Harika hasini creations) పై చినబాబు(Chinababu), సూర్యదేవర నాగవంశీ(Suryadevara nagavanshi) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో..బ్యూటీ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి కానుక‌గా 12 జనవరి 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది.