సీఎం కుర్చీపై ఎవరు కూర్చున్నా.. ప్రజల మద్దతు మాకే

సీఎం కుర్చీపై ఎవరు కూర్చున్నా.. ప్రజల మద్దతు మాకే

పాట్నా: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చేతిలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్బంధన్ ఓడిపోయింది. అధికారానికి అడుగు దూరంలో నిలిచినప్పటికీ తేజస్వీ యాదవ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు. భవిష్యత్‌‌లో నితీశ్ కుమార్‌‌కు గట్టిపోటీని ఇవ్వగలనని నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత, తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ లేనప్పటికీ తేజస్వీ తనదైన మార్క్ ప్రచారంతో ప్రజలను ఆకట్టుకున్నారు. తాజాగా ఎన్నికల ఫలితాలపై తేజస్వీ స్పందించారు. సీఎం కుర్చీపై ఎవరు కూర్చున్నా ప్రజల మద్దతు తనకు స్పష్టంగా ఉందన్నారు. ‘ప్రజలు మహాగట్బంధన్‌‌కు మద్దతు తెలిపారు. కానీ ఎన్నికల కమిషన్ రిజల్ట్ ఎన్డీయేకు ఫేవర్‌‌గా ఉంది. ఇలా జరగడం తొలిసారి కాదు. 2015లో మహాగట్బంధన్ ఏర్పాటైన టైమ్‌‌లో ఓట్లు మాకు పడ్డాయి. కానీ బీజేపీ బ్యాక్ డోర్ నుంచి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది’ అని తేజస్వీ పేర్కొన్నారు.