పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో తండ్రి సమాధి దగ్గరే ఆదివారం ఉదయం పునీత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎంతో పాటు అనేక మంది ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అధికారిక లాంఛనాలతో పునీత్ అంతిమ సంస్కారాలు చేశారు. పునీత్ కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్ తో దహన కార్యక్రమాలు చేయించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు పునీత్ కడసారి వీడ్కోలు పలికారు. కోట్లాది మంది ఆత్మీయ బంధువు, విలక్షణ నటుడు, కన్నడ సినీ పరిశ్రమ ముద్దుబిడ్డ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన ఇకలేరనే విషయం తెలుసుకున్న ప్రజలు కడసారి చూపు కోసం శనివారం లక్షల సంఖ్యలో తరలివచ్చారు. పునీత్ రాజ్కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేసే సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూసిన విషయం తెలిసిందే.
Karnataka: The last rites of Kannada actor #PuneethRajkumar were performed at Sree Kanteerava Studios in Bengaluru today with state honours. pic.twitter.com/mzk5m9GoBR
— ANI (@ANI) October 31, 2021