నేడు బీజేపీలో చేరనున్న అమరీందర్ సింగ్

నేడు బీజేపీలో చేరనున్న అమరీందర్ సింగ్

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీలో విలీనం చేయనున్నారు. కెప్టెన్ తో పాటు ఆయన కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, మనుమడు నిర్వాన్ సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాషాయ కండువా కప్పుకోనున్నారు. అమరీందర్ సింగ్ గతేడాది  కాంగ్రెస్ ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ తో పాటు ఆ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు.