
పూరి జగన్నాథ రథయాత్ర సందర్బంగా జరిగిన తొక్కిసలాటకు బాధ్యులైన ఇద్దరు అధికారులపై వేటుపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్రప్రభుత్వం.. పూరి ఎస్పీ వినీత్ అగర్వాల్, జిల్లా మేజిస్ట్రేట్ సిద్దార్థ శంకర్ స్వేన్లను బదిలీ చేసింది. పూరీ తొక్కిసలాగ ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.ప్రస్తుతం ఏడీజీ (క్రైమ్)గా ఉన్న సీనియర్ అధికారి పినాక్ మిశ్రాని పూరి ఎస్పీగా నియమించారు. కొత్త జిల్లా కలెక్టరేట్ గా ఖుర్దా కలెక్టర్ చంచల్ రాణా బాధ్యతలు స్వీకరిరంచనున్నారు.
ALSO READ | పూరీ గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
ఒడిశాలోని పూరీలోని శ్రీ గుండిచా ఆలయం సమీపంలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున -4.30 గంటల ప్రాంతంలో భారీ జనసమూహం మధ్య ఈ సంఘటన జరిగింది. శ్రీ గుండిచా ఆలయం సమీపంలో దర్శనం కోసం వందలాది మంది భక్తులు అకస్మాత్తుగా ముందుకు సాగడంతో తొక్కిసలాట జరిగింది.
మృతులు ఖుర్దా జిల్లాకు చెందిన ప్రతివా దాస్ ఫిమేల్ (52), ప్రేమకాంత మొహంతి (78),బసంతి సాహు (42) గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రద్దీకి కారణం,భక్తుల సమూహం నియంత్రణలో లోపాలపై దర్యాప్తు సాగుతోంది.