పూరీ గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

పూరీ గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

భువనేశ్వర్: పూరి జగన్నాథ్ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజూమన గుండిచా ఆలయం ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. కాగా, శుక్రవారం (జూన్ 27) మొదలైన పూరి జగన్నాథ్ రథయాత్ర శనివారం (జూన్ 28)  గుండిచా టెంపుల్‎కు చేరుకుంది.

ఈ క్రమంలోనే ఆదివారం (జూన్ 29) తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుండిచా ఆలయంలో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఊహించిన దాని కంటే భక్తులు ఎక్కువ మంది తరలి రావడంతో గుండిచా ఆలయ పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. 

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక చాలా మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఘటన స్థలంలో అధికారులు సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట తీవ్రతను భట్టి చూస్తే ఈ ఘటనలో మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.