హైదరాబాద్, వెలుగు: షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గోపిచంద్, పీవీ సింధు మన తెలంగాణ బిడ్డలు కాదని, రాష్ట్ర క్రీడారంగం గురించి చెప్పినప్పుడు వాళ్ల పేర్లు చెప్పడంకంటే మన దగ్గర ఉన్నవాళ్లను ప్రోత్సహించాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం అసెంబ్లీలో క్రీడలు, యువజన సర్వీస్ల శాఖ పద్దులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి క్రీడారంగంలో రాణిస్తున్నారని వీరిద్దరి పేర్లు చెప్పారు.
దీనిపై క్రాంతి పైవిధంగా స్పందించారు. ఇక్కడి స్పోర్ట్స్ స్కూళ్లలో మెరిట్ ఉన్నప్పటికీ తెలంగాణ పిల్లలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఓ జర్నలిస్ట్ కూతురికి ఇలాగే జరిగితే తాను జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.