కరోనా క్రైసిస్.. కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు

కరోనా క్రైసిస్.. కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రజలకు అండగా ఉండాలని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. ఈ పరిస్థితులను నియంత్రించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న రాహుల్.. ప్రజలకు సాయం చేసేందుకు కాంగ్రెస్ వర్కర్స్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 

‘కరోనా పరిస్థితులను నియంత్రించడంలో మన వ్యవస్థ విఫలమైంది. అందుకే జనహితం గురించి మేం మాట్లాడటం కీలకంగా మారింది. ఈ విషమ  పరిస్థితుల్లో బాధ్యత కలిగిన పౌరుల అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలందరూ రాజకీయ వ్యవహారాలను పక్కనబెట్టి దేశ ప్రజలకు బాసటగా నిలవండి. ఇదే కాంగ్రెస్ కార్యకర్తల విధి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.