న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రజలకు అండగా ఉండాలని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. ఈ పరిస్థితులను నియంత్రించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్న రాహుల్.. ప్రజలకు సాయం చేసేందుకు కాంగ్రెస్ వర్కర్స్ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
‘सिस्टम’ फ़ेल है इसलिए ये जनहित की बात करना ज़रूरी है:
— Rahul Gandhi (@RahulGandhi) April 25, 2021
इस संकट में देश को ज़िम्मेदार नागरिकों की ज़रूरत है। अपने कांग्रेस साथियों से मेरा अनुरोध है कि सारे राजनैतिक काम छोड़कर सिर्फ़ जन सहायता करें, हर तरह से देशवासियों का दुख दूर करें।
कांग्रेस परिवार का यही धर्म है।
‘కరోనా పరిస్థితులను నియంత్రించడంలో మన వ్యవస్థ విఫలమైంది. అందుకే జనహితం గురించి మేం మాట్లాడటం కీలకంగా మారింది. ఈ విషమ పరిస్థితుల్లో బాధ్యత కలిగిన పౌరుల అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలందరూ రాజకీయ వ్యవహారాలను పక్కనబెట్టి దేశ ప్రజలకు బాసటగా నిలవండి. ఇదే కాంగ్రెస్ కార్యకర్తల విధి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.