
తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాహుల్, ప్రియాంక.. నేరుగా ములుగు జిల్లా రామప్ప గుడికి వెళ్లనున్నారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకుల పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బస్సు యాత్రగా బయలుదేరి వెంకటాపూర్ మండలం రామాంజపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడే మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు ప్రియాంక. సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన నేపథ్యంలో భద్రతా బలగాలు భారీగా మోహరించారు. రామప్ప ఆలయాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో హై అలెర్ట్ చేపట్టారు. రామప్పకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. బసుయాత్ర రూట్ పొడవునా నో ఫ్లై జోన్ ప్రకటించారు.
ALSO READ : రాహుల్, ప్రియాంక గాంధీ టూర్.. రామప్ప ఆలయాన్ని మోహరించిన భద్రతా బలగాలు
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరుగా కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు రోజులపాటు కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర చేయనున్నారు. 3 రోజుల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రల్లో రాహుల్, ప్రియాంక పాల్గొననున్నారు.
షెడ్యూల్..
* అక్టోబర్ 18న ములుగు, భూపాలపల్లిలో పర్యటన
* 19న రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్ లో యాత్ర
* 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సుయాత్ర
* ఆర్మూర్ లో పసుపు రైతులతో భేటీ కానున్నారు రాహుల్ గాంధీ.