చిన్నారికి సాయం చేసిన రాహుల్ గాంధీ

చిన్నారికి సాయం చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఆదివారం కేరళలోని హరిపాడ్ నుంచి ఆయన 11వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అలపుజా పట్టణంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహిస్తుండగా.. అందులో పాల్గొంటున్న ఓ చిన్నారి చెప్పులు సరిగా తొడుక్కోకపోవడంతో నడకలో ఇబ్బంది ఎదురైంది. ఇది గమనించిన రాహుల్.. ఆ బాలిక పాదరక్షలు సరిగా వేసుకునేందుకు సాయం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. రాహుల్ తీరును పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వారం క్రితం కేరళలో ప్రవేశించింది. పాదయాత్రలో ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేత కె. మురళీధఱన్, రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, కొడికున్నిల్ సురేష్ తదితరులు ఉన్నారు. ఈ నెల 21న రాహుల్ యాత్ర ఎర్నాకుళం జిల్లాలోకి ప్రవేశించనుండగా.. 23న త్రిస్సూర్ చేరుకోనుంది. సెప్టెంబర్ 26, 27న పాలక్కడ్, 28న మలాపురంలో భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.