రాజస్థాన్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

రాజస్థాన్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఇవాళ జీనాపూర్, సవాయ్ మదుపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

నిన్న పాదయాత్రలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరయా వాద్రా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటి దిగనంగన సూర్యవంశి కూడా పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్​ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. గత సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. రాహుల్​ పాదయాత్రకు అన్ని రాష్ట్రాల్లోని ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.