స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ

స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల ప్రజలతో మమేకమవుతున్న ఆయన ఇవాళ కాసేపు సరదాగా గడిపారు. పున్నమాడ లేక్లో నిర్వహించిన స్నేక్ బోట్ రేస్ ఎగ్జిబిషన్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొనగా రాహుల్ ఉన్న బోట్ విజయం సాధించింది. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ పాల్గొన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. 

2024 ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన118 మంది పార్టీ నేతలు యాత్రలో పాల్గొంటున్నారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 5 నెలల పాటు సాగనున్న ఈ పాదయాత్ర కాశ్మీర్లో ముగియనుంది.