తెలంగాణలో కేసీఆర్ ఫాంహౌస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023, నవంబర్ 28వ తేదీ మంగళవారం మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ నిర్వహించిన రోడ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ర్యాలీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ ప్రసంగంలో హైలెట్స్
- మీతో మాది కుటుంబ అను బంధం.
- మా కుటుంబంతో మీ అందరికి సంబంధం ఉంది.
- దేశవ్యాప్తంగా నాపై మోదీ సర్కార్ 24 కేసులు పెట్టింది.
- నేను ఉంటున్న ఇళ్లు తీసుకున్నా నాకు బాధ లేదు.
- దేశంలోని కోట్ల మంది గుండెల్లో నేను ఉన్నా
- అవసరమైనప్పుడల్లా మోదీ సర్కార్ బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
- బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే
- కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదల అకౌంట్లో వేస్తాం.
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం.
- కాంగ్రెస్ గెలిస్తే..తెలంగాణలో ప్రజల సర్కార్ వచ్చినట్లే.