
న్యూఢిల్లీ: రైళ్లలో టికెట్ ఛార్జీలపై భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ట్రైన్ టికెట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ ఛార్జీలు అర్ధరాత్రి నుంచి.. అంటే జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. గమ్యస్థానం 5 వందల కిలోమీటర్ల లోపు ఉంటే సెకండ్ క్లాస్ రైలు టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. 501 కిలోమీటర్ల నుంచి 15 వందల కిలోమీటర్ల లోపు ఉంటే టికెట్ ధరపై 5 రూపాయలు, 1501 కిలోమీటర్ల నుంచి 2 వేల 500 కిలోమీటర్ల రైలు ప్రయాణానికి టికెట్పై 10 రూపాయలు, 2501 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల రైలు ప్రయాణానికి టికెట్ ధరపై 15 రూపాయలు పెంచుతున్నట్లు టికెట్ ధరల పెంపుపై భారతీయ రైల్వే వివరాలను వెల్లడించింది.
స్లీపర్ క్లాస్ టికెట్ ధరల విషయానికొస్తే.. కిలోమీటర్పై 0.5 పైసలు, ఫస్ట్ క్లాస్ టికెట్ ధరపై కూడా కిలోమీటర్పై 0.5 పైసలను రైల్వే శాఖ పెంచింది. దేశవ్యాప్తంగా రోజూ 13 వేలకి పైగా నాన్-ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. పెరిగిన స్వల్ప ధరలతో తక్కువ దూరం వెళ్లే ప్రయాణికులపై ఎలాంటి భారం పడదని అధికారులు తెలిపారు. తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే ఆధార్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ | EV News: BMW కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జూలై 3న లాంచ్, రేటెంతంటే..
ఈ నిబంధన కూడా జులై 1 నుంచే అమలులోకి వస్తుంది. ఈ కొత్త నియమం ప్రకారం..ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి ఆధార్ ధ్రువీకరణ అవసరం. ఇక జులై 15 నుంచి అన్ని తత్కాల్ బుకింగ్లకు (ఆన్లైన్, కౌంటర్, అధీకృత ఏజెంట్ల ద్వారా) ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ కూడా తప్పనిసరి.