
Electric Scooter: పెట్రోల్ వాహనాల కాలం మెల్లగా పోతోంది. లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఎలక్ట్రిక్ టూవీలర్లకు మారుతున్నారు. ఈ క్రమంలో జర్మన్ ఆటో దిగ్గజం బీఎండబ్ల్యూ తన సరికొత్త ఈవీని జూలై 3న లాంచ్ చేస్తోంది.
బీఎండబ్ల్యూ సీఈ 04 పేరుతో వస్తున్న ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ ప్రపంచ వ్యాప్తంగా విక్రయానికి సిద్ధమైంది. ప్రస్తుతం అప్ గ్రేడ్ చేయబడిన ఫీచర్లతో వస్తున్న ఈవీ భారత మార్కెట్ ఎక్స్ షోరూం ధర ప్రస్తుతం ఉన్న మోడల్ రేటు రూ.15లక్షల 25వేల కంటే ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. మెుదటగా దీనిని అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసిన తర్వాత భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ALSO READ | Trade War: టారిఫ్స్ పొడిగించే ఆలోచనలేదన్న ట్రంప్.. కొనసాగుతున్న భారత చర్చలు..
కొత్తగా మార్కెట్లోకి వస్తున్న బైక్ 8.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుందని వెల్లడైంది. కేవలం 2.6 సెకన్లలో బండి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. కొత్త మోడల్ పాతదానికంటే తక్కువ సమయంలోనే చార్జ్ కాగలదని, అలాగే మైలేజ్ కూడా పాతదానితో పోల్చితే మెరుగుపర్చబడిందని కంపెనీ చెబుతోంది. అలాగే బైక్ కొనుగోలుదారులు ఫాస్ట్ చార్జర్ తీసుకుంటే గంట నలభై నిమిషాల్లో బండి ఫుల్ చార్జ్ చేయబడుతుందని వెల్లడైంది.