
చరిత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాలు తప్పకుండ ఆదరించబడతాయి. అమరావతి రాజధాని ఇష్యూ కథాంశంగా 'రాజధాని ఫైల్స్ (Rajadhani Files) అనే సినిమా రూపుందోతుంది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని..అందులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను..ఈ సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపించనున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్గా రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా రానుందని సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ డిజైన్ తోనే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. టైటిల్ లోగోలో పొలం దున్నే నాగలి ఉండటం..జనం మధ్యలో నుంచి ఒక నాయకుడు పుట్టుకొచ్చి..వేలాది మంది రైతులకు నేనున్నాను అనే భరోసా వాళ్లలో కలిగేలా చేయడం ఆసక్తికరంగా ఉంది. అలాగే రిలీజ్ చేసిన పోస్టర్ మీద 'ఒకే ఒక్కడి అహం..వేలమంది రైతుల కన్నీరు..కోట్ల కుటుంబాల భవిష్యత్తు..' అని రాసుంది.
రాజధాని ఫైల్స్ మూవీకి భాను శంకర్ దర్శకత్వం వహిస్తుండగా..శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం స్వరాలూ సమకూరుస్తుండగా, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి పనిచేసిన నటీనటుల వివరాలు త్వరలో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
#BreakingNews : మన రైతులు చెప్పిన కథ #RaajadhaniFilesMovie #Firstlook
— TeluguOne (@Theteluguone) February 1, 2024
#Raajadhanifiles#MovieonAmravathi #Firstlook #Farmerrights #AndhraPradesh #Amravathi pic.twitter.com/gNwXuTPhgk