మూడోసారి టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు

మూడోసారి టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు

సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూడటం లేదన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సింగరేణిని ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ పరం చేయదని చెప్పారు. సింగరేణిలో ఇటీవల జరిగిన టెండర్లలో గోల్ మాల్ జరిగిందన్నారు.టెండర్లలో అక్రమాలు జరిగినట్లు తాను నిరూపించకపోతే రాజీనామా చేస్తానన్నారు.కేంద్రం కేటాయించిన బ్లాక్ ను ప్రైవేట్ పరం చేసి వేల కోట్ల రూపాయలను దోచుకోబోతున్నారన్నారు.  తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్రా పెట్టుబడిదారులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోని రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారని...మూడోసారి టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు రాజగోపాల్ రెడ్డి.