కారుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం

కారుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం

రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది.  కారుపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు.  మృతుల్లో  ముగ్గురు పిల్లలు,  ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారులోని వ్యక్తులు పాగీ నుంచి అజ్మీర్ కు  తీర్థయాత్రకు వెళ్తున్నారు.  జైపూర్- అజ్మీర్ హైవేపై రామ్ నగర్ దగ్గర రాగానే ఎదురుగా వస్తున్న  ఓ ట్రక్కు టైరు  పగిలిపోవడంతో కారుపై దూసుకెళ్లిందని  అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.  మృతి చెందిన ఆరుగురిని హసీనా, సోను, ఇస్రాయిల్, రోహినా, మురాద్, షకీల్‌గా గుర్తించామని, మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.