కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది

కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది

కేంద్ర ప్రభుత్వ నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి తాను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభలో తెలంగాణ గొంతుకను వినిపిస్తానని అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ (బీజేపీ ప్రభుత్వం) ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ ఆకాంక్ష అయిన డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమన్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి పాలనపై సీఎం కేసీఆర్ వ్యంగంగా మాట్లాడుతున్నారంటూ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మండిపడ్డారు. కుటుంబ పాలనకు తావు లేకుండా అర్హులందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించే పాలన డబుల్ ఇంజన్ సర్కారుదే అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగడం లేదని, కుటుంబ పాలన కొనసాగుతుందోని మండిపడ్డారు.  ఏ కారణాలతో విభజన హామీలు అమలు కాలేదో రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలుసన్నారు.