రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని భూ సమస్యలు, అభివృద్ధి పనులపై శుక్రవారం ఆర్డీవో ఆఫీసులో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. సెగ్మెంట్లో చేపట్టిన పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్, అధికారులు పాల్గొన్నారు.