కోచ్ రవిశాస్త్రిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

కోచ్ రవిశాస్త్రిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

నిత్యం వివాదాల్లో ఉండే ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి వార్తలకెక్కారు. ఎన్నడూ లేని విధంగా.. గతాన్ని మైమరిపిస్తూ.. లెజెండరీ ప్లేయర్లు ప్రయత్నించినా సాధ్యంకాని ఓ రికార్డును.. విరాట్‌‌సేన అలవోకగా పట్టేసింది .  సౌతాఫ్రికాతో సిరీస్‌‌ను తొలిసారి 3–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేస్తూ నయా చరిత్రను సృష్టించింది..! మొత్తానికి స్వదేశంలో వరుసగా 11వ సిరీస్‌‌ విజయాన్ని అందుకున్న టీమిండియా.. సఫారీలపై అతి పెద్ద విక్టరీని సొంతం చేసుకుంది..!!

అయితే ఇంత పెద్ద విక్టరీని సాధించేందుకు భారత్ ఆటగాళ్ల గ్రౌండ్ లో విరోచిత పోరాటం చేస్తుంటే..కోచ్ రవిశాస్త్రి డ్రెసింగ్ రూమ్ లో హాయిగా కునుకు తీస్తూ కనిపించారు.

కోచ్ నిద్రపోతున్న సమయంలో భారత ఆటగాడు శుభ్ మన్ గిల్ మ్యాచ్ చూస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించడంపై శుభ్ మన్ గిల్ తో పాటు సహచర ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. కానీ రవిశాస్త్రి అవేం పట్టించుకోకుండా నిద్రపోతున్నారు.  కునుకు తీసిన ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు రవిశాస్త్రిని ట్రోల్ చేస్తూ ఫన్నీ పోస్ట్ లు పెడుతున్నారు.

   నా జీవితంలో మంచి విషయాలు జరుగుతాయని, నేను ఎదురు చూస్తున్నాను, అదే నా కిస్మత్ అని మెడిక్రే అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. 

 ప్రపంచంలో అత్యుత్తమైన ఉద్యోగం రవిశాస్త్రిది. ఇష్టం వచ్చినట్లు కూల్ డ్రింక్స్ తాగుతారు, ఆఫీస్ అవర్స్ లో నిద్రపోతూనే కోట్లలో డబ్బులు సంపాధిస్తారని మరో నెటిజన్ లమే సెటైర్లు వేశాడు.